భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు

65చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో బుధవారం రాత్రి మొహర్రం వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. బజార్ ఏరియాలో జరిగిన ఈ వేడుకల్లో హిందూ, ముస్లింలు సమిష్టిగా పాల్గొన్నారు. పాత బస్టాండ్ నుంచి కాంటా చౌరస్తా వరకు పీర్లను ఏర్పాటు చేశారు. కులమతాలకతీతంగా పీర్లను దర్శించుకున్నారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. వన్ టౌన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్