బెల్లంపల్లి అంగన్వాడి ఉపాధ్యాయురాలిపై విచారణ

60చూసినవారు
బెల్లంపల్లి అంగన్వాడి ఉపాధ్యాయురాలిపై విచారణ
బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తి అంగన్వాడి ఉపాధ్యాయురాలు పోటు ప్రమీలపై ఐసిడిఎస్ సిడిపిఓ స్వరూప రాణి శుక్రవారం విచారణ చేపట్టారు‌. ప్రమీల విధులకు సక్రమంగా హాజరు కాకుండా ఆయాతో అంగన్వాడి కేంద్రాన్ని నడిపిస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. సిడిపిఓ ఇంటింటా తిరిగి బస్తివాసులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్