జేఏసీ అధ్యక్షునిగా రామ్ కుమార్

65చూసినవారు
జేఏసీ అధ్యక్షునిగా రామ్ కుమార్
మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ల జేఏసీ అధ్యక్షునిగా బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రామ్ కుమార్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద స్థానిక ఆటో డ్రైవర్లు, వర్కర్ల ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్