నెన్నెల గ్రామపంచాయతీ బొప్పారంలో గత కొన్ని నెలల నుంచి తాగునీటి సమస్యతో గ్రామీణ ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం ఇక్కడ బోరు బావి, మోటారు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. దీంతో స్థానిక నాయకుడు తోట శ్రీనివాస్ దృష్టికి సమస్యను గ్రామీణ ప్రజలు తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన నీటి సమస్యను తీర్చారు దీంతో గ్రామీణ ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.