పాత్రికేయుడిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

81చూసినవారు
చెన్నూర్ లో పాత్రికేయుడు వెంకటేష్ పై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి బి. గోపీనాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ లోకి చొరబడి పాత్రికేయుడిపై దాడి చేయడం అప్రజాస్వామికం అన్నారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి స్పందించి దాడి వెనుక వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్