వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కలెక్టర్

59చూసినవారు
చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో గ్రామాఖ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యంకు ప్రభుత్వ కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ క్వింటాల్ కు రూ. 2, 203, కామన్ గ్రేడ్ క్వింటాల్ కు రూ. 2, 183 చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్