ఆదివాసి భవనానికి నిధులు మంజూరు చేయాలి

60చూసినవారు
ఆదివాసి భవనానికి నిధులు మంజూరు చేయాలి
చెన్నూర్ నియోజకవర్గం కేంద్రంలో ఆదివాసి భవనం నిర్మాణం, కొమరం భీం విగ్రహంకు నిధులు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కోరారు. ఈ మేరకు చెన్నూరులో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి ఆయన వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత స్థలం ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్