ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన నాలుగోర్యాంక్కు చేరుకుంది. మంగళవారం విడుదలైన ఈ ర్యాంకింగ్స్లో మంధాన 696 పాయింట్లతో రెండు ర్యాంక్లు మెరుగుపర్చుకుని నాలుగులో నిలిచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో మంధాన 31.50 సగటుతో 63 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ నటాలీ స్కీవర్ (807) నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్నది. బౌలింగ్లో దీప్తిశర్మ (654) 4వ ర్యాంక్లో ఉంది.