హాస్టళ్లలో ఎన్నో సమస్యలు..

59చూసినవారు
హాస్టళ్లలో ఎన్నో సమస్యలు..
తెలంగాణ రాష్ట్రంలో పలు హాస్టళ్లలో ఏసీబీ బృందాలు చేసిన తనిఖీల్లో ఎన్నో సమస్యలు వెలుగుచూశాయి. జాంబాగ్‌ ఎస్సీ బాలుర హాస్టల్‌లో వసతులు సరిగ్గా లేవని, నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలోని గాంధీనగరం ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందట్లేదని, మరుగుదొడ్లు దుర్వాసన వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల జిల్లా ఇప్పలపల్లి గురుకుల పాఠశాలలో సరిపడా సదుపాయాలు లేవని ఏసీబీ అధికారులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్