దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం నిర్వహించిన రెండు స్పెషల్ ట్రేండింగ్ సెషన్లో భారీ లాభాలను ప్రదర్శించాయి. సెన్సెక్స్ 58 పాయింట్లు లాభపడి 73,804 వద్ద ముగిసింది. నిఫ్టీ 39 పాయింట్లు వృద్ధి చెంది 22,419కు చేరి ఆల్ టైమ్ హై రికార్డును నమోదు చేసింది. ఇక టాటా స్టీల్, టాటా మోటార్స్, విప్రో, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, ఎస్బీఐ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.