దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పిల్లల కంటి ఆస్పత్రిలో ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లజ్పత్నగర్లోని ఐ7 చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. 12 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపుచేస్తున్నారు.