ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను తిరిగి నియమించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అతడికి అప్పగించారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది జరిగిన వారాల వ్యవధిలోనే మళ్లీ ఆకాశ్కే ఆమె ఆ పదవిని కట్టబెట్టడం ఆసక్తికరంగా మారింది.