హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలో సోమవారం రోజున
టాటా మ్యాజిక్ బోల్తా పడింది. మొగుళ్ళపల్లి మండలం ఇస్సిపేటకు చెందిన కుటుంబ సభ్యులు 10 మంది
టాటా మ్యాజిక్ వాహనంలో వేములవాడ వెళ్తుండగా ఘటన జరిగింది. స్టీరింగ్ రాడ్డు విరగడంతో ఆటో బోల్తా పడడంతో ఊరుగొండ శ్రీను (40) అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. తెనుపుల గట్టయ్య అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
8 మంది సేఫ్ గానే ఉన్నారు.