చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతల భేటీ

75చూసినవారు
చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతల భేటీ
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డి మనుమరాలు, రాజశేఖర్ కూతురు శ్రేయారెడ్డి వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రబాబు నివాసానికి కలిశారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. సమావేశం అనంతరం తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. త్వరలో టీడీపీలో చేరతామని కృష్ణారెడ్డి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్