ట్రైన్‌లో ప్రయాణికుల సమస్యలు వింటూ మంత్రి జర్నీ

80చూసినవారు
ట్రైన్‌లో ప్రయాణికుల సమస్యలు వింటూ మంత్రి జర్నీ
ఏపీ మంత్రి వంగలపూడి అనిత ఓ సాధారణ ప్రయాణికురాలిలా వందేభారత్ ట్రైన్‌లో నేడు ప్రయాణం చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు ఆమె వెళ్లారు. రైలులోని ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా వారి యోగక్షేమాలపై ఆరాతీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్