రైస్‌ మిల్లులో టార్చిలైట్‌ వేసుకుని మంత్రి నాదెండ్ల తనిఖీలు

57చూసినవారు
రైస్‌ మిల్లులో టార్చిలైట్‌ వేసుకుని మంత్రి నాదెండ్ల తనిఖీలు
తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్లలో శ్రీ వెంకట సత్య రైస్ మిల్లును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. మూసి ఉన్న గోడౌన్‌లో భారీగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్టు గుర్తించారు. బియ్యం సంచులపై విదేశీ కంపెనీల పేర్లు ఉన్నట్లు గుర్తించిన ఆయన.. టార్చిలైట్ వెలుగులోనే స్టాక్‌ను పరిశీలించారు. అక్రమ రవాణా కోసం విదేశాలకు సరఫరా చేసేందుకు వీటిని ఇక్కడ నిల్వ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్