ఛాంపియన్స్ ట్రోఫీ ముగియగానే తర్వాత ఐపీఎల్ 2025 జరగనుంది. దాదాపు మూడు నెలలు వరుసగా మ్యాచులు జరగనుండడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఐపీఎల్- 2025 సీజన్కు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ను ప్రకటించేందుకు కమిటీ సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం షెడ్యూల్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గతేడాది లాగే ఈసారి కూడా విశాఖపట్నంలో ప్రారంభ మ్యాచులు నిర్వహించనున్నట్లు సమాచారం.