టోల్ ఛార్జీలపై కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే లేఖ

51చూసినవారు
టోల్ ఛార్జీలపై కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే లేఖ
అస్సాంలోని ఖుమ్తాయ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మృణాల్ సైకియా టోల్ వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి తాజాగా ఆయన లేఖ రాశారు. జాతీయ రహదారితో అనుసంధానించే 'టోల్ రోడ్ 37'పై టోల్ వసూలును నిలిపివేయాలని కోరారు. ఓ వైపు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, అయినప్పటికీ టోల్ వసూల్ చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్