బైడెన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ

59చూసినవారు
బైడెన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ
జీ7 సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సమావేశం కానున్నారు. గతేడాది భారత్‌లో జరిగిన జీ20 సదస్సు తర్వాత వీరిద్దరి మధ్య ఇదే తొలి సమావేశం. సిక్కు వేర్పాటువాదంపై వీరిద్దరూ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్స్‌కీతోనూ మోదీ భేటీ కానున్నారు.

సంబంధిత పోస్ట్