భారతీయులకు 509 వీసాలు జారీ చేసిన పాక్

83చూసినవారు
భారతీయులకు 509 వీసాలు జారీ చేసిన పాక్
తమ దేశంలో జరగనున్న మహారాజా రంజీత్ సింగ్ వర్ధంతికి హాజరయ్యేందుకు భారత్ నుంచి వచ్చిన సిక్కు యాత్రికులకు పాకిస్థాన్ 509 వీసాలు జారీ చేసింది. జూన్ 21-30 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. దీనిపై భారత్‌లోని పాకిస్తాన్ హైకమిషన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహారాజా రంజీత్ సింగ్ 19వ శతాబ్దంలో సిక్కు సామ్రాజ్యానికి మొదటి రాజు. అతను 'షేర్-ఎ-పంజాబ్'గా ప్రసిద్ధి చెందాడు.

సంబంధిత పోస్ట్