గోరంత దానికి కొండంత ప్రచారం చేస్తున్న మోదీ ప్రభుత్వం: రేవంత్

79చూసినవారు
గోరంత దానికి కొండంత ప్రచారం చేస్తున్న మోదీ ప్రభుత్వం: రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో చేసిన పనులు చెప్పుకోవడంలో, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో వెనకబడి ఉన్నామని కాంగ్రెస్‌ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గోరంత చేస్తే కొండంత ప్రచారం చేసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7 నెలల స్వల్పకాలంలో సంక్షేమ, అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్