రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. యావత్ హిందూ సమాజాన్ని హింసాత్మకమైనదిగా పేర్కొనడం చాలా తీవ్రమైన అంశమని ఆయన పేర్కొన్నారు. అయితే, తాను బీజేపీ గురించి మాట్లాడుతున్నానని, బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ అంటే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు. హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ. కోట్లాది మంది ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.