భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన పేస్ గన్ బుమ్రా ఓ అరుదైన రికార్డు సృష్టించారు. టీ20 వరల్డ్ కప్లో ఒక్క రన్ కూడా చేయకుండానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న మొదటి క్రికెటర్గా నిలిచారు. బుమ్రాకు కేవలం పాక్పై బ్యాటింగ్ అవకాశం రాగా అందులో గోల్డెన్ డకౌట్ అయ్యారు. ఆయన 29.4 ఓవర్లు వేసి 15 వికెట్లు తీశారు. ఈ స్పీడ్గన్ బౌలింగ్లో కేవలం 12 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి.