తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కదం తొక్కారు. నిరుద్యోగుల సమస్యపై గాంధీ ఆస్పత్రి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్కి సపోర్టుగా నిరసనలు చేశారు. వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చెయ్యాలనీ, గ్రూప్-1 పోస్టుల్ని పెంచాలనీ డిమాండ్ చేశారు. మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.