కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తక్షణ చర్యలకు సిద్ధపడ్డారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ను ఆదేశించారు. బుధవారం ఉదయం కువైట్ సిటీలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 40 మందికి పైగా భారతీయ కార్మికులు మరణించిన విషయం తెలిసిందే.