ఓం బిర్లాపై మోదీ ప్రశంసలు

65చూసినవారు
ఓం బిర్లాపై మోదీ ప్రశంసలు
లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా రెండోసారి ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఆయన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఓం బిర్లాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘స్పీకర్‌ పదవి ఎంత కఠినమైందో మీకు బాగా తెలుసు. సభను సరైన దిశలో నడపడంలో స్పీకర్‌ది కీలక పాత్ర. మీ మధురమైన చిరునవ్వుతో సభ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’’ అని మోదీ ప్రశంసలు కురిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్