మారని ఇసుక దందా పంథా

68చూసినవారు
మారని ఇసుక దందా పంథా
తెలంగాణలో ప్రభుత్వాలు మారినా ఇసుక దందా పంథా మారడం లేదు. క్షేత్ర స్థాయిలో వేళ్లూనుకుపోయిన మాఫియా.. దర్జాగా దౌర్జన్యానికి పాల్పడుతోంది. ఇసుకాసురులపై కఠిన చర్యలు లేక రెచ్చిపోతున్నారు. అక్రమ రవాణాతో జేబులు నింపుకొంటూ అడ్డొచ్చినవారిపై దాడులకు పాల్పడుతున్నారు. నిత్యం ట్రాక్టర్లలో టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తుండటంతో ఆందోళన కలిగిస్తోంది. పోలీసు, రెవెన్యూ అధికారుల ఉదాసీనతకు తోడు స్థానిక నాయకుల అండతో దందా కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్