ఈనెల 21 నుంచి మోడీ అమెరికా పర్యటన

60చూసినవారు
ఈనెల 21 నుంచి మోడీ అమెరికా పర్యటన
సెప్టెంబర్ 21 నుండి 23వరకు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధాని షెడ్యూల్‌ వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ గురువారం మీడియాకు వెల్లడించారు. క్వాడ్‌ సదస్సుకు హాజరవడం కోసం ప్రధాని మోడీ నేరుగా డెల్వర్‌లోని విల్మింగ్టన్‌కు వెళతారని మిస్త్రీ తెలిపారు. అంతకుముందు ఐక్యరాజ్య సమితి సదస్సుకు హాజరయ్యేందుకు న్యూయార్క్‌ వెళతారు. టెక్‌ సిఇఓలతో సమావేశాలు, వివిధ నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని మిస్త్రీ తెలిపారు.

సంబంధిత పోస్ట్