ఈనెల 18న వారణాసిలో మోడీ పర్యటన

83చూసినవారు
ఈనెల 18న వారణాసిలో మోడీ పర్యటన
మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా ఈనెల 18న వారణాసిలో పర్యటించనున్నారు. కాగా, ఆయన ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి ఎన్నికవడం విశేషం. ఇక పర్యటనలో భాగంగా రైతు సదస్సులో పాల్గొని.. రైతులకు ప్రయోజనం చేకూర్చే సమ్మాన్ నిధిని విడుదల చేయనున్నారు. వారణాసిలోని రోహనియా, సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సదస్సుకు వేదిక ఉండనున్నట్లు యూపీ బీజేపీ నేతలు తెలిపారు. పర్యటన బాగంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్