మోదీ పీఎంగా తప్పుకోవాలి: కేసీఆర్

60చూసినవారు
మోదీ పీఎంగా తప్పుకోవాలి: కేసీఆర్
లోక్ సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'బీజేపీ రూల్ ప్రకారం ఏ నేత అయినా 75 ఏళ్ల వయసు తర్వాత పదవులు చేపట్టొద్దు. కాబట్టి నరేంద్ర మోదీ తన పీఎం పదవి నుంచి తప్పుకోవాలి. దీనిపై బీజేపీ నేతలు ఆలోచన చేయాలి' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాము ఏ కూటమిలో లేమని తెలిపారు.

సంబంధిత పోస్ట్