ప్రధాని మోడీ నేడు జమ్మూలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 30,500 కోట్ల అభివృద్ధి పనులను దేశానికి అంకితం చేయనున్నారు. అలాగే, అధునాతన వసతులతో నిర్మించిన ఎయిమ్స్ను మోడీ ప్రారంభించనున్నారు. వీటితో పాటు హెల్త్, ఎడ్యూకేషన్, రైళ్లు, రోడ్డు, ఏవియేషన్, పెట్రోలియం, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో సహా వివిధ అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.