హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చిన వానరాన్ని తప్పించబోయి ఓ కారు ట్యాంకర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్- అలీగఢ్ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.