బావిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య

81చూసినవారు
బావిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సారంగాపూర్ మండల పరిధిలో గురువారం తల్లీకూతుళ్లు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. అర్పపల్లి గ్రామానికి చెందిన మౌనిక అనే మహిళ తన నాలుగేళ్ల కుమార్తెతో పాటు పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మహిళ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్