ముగ్గురు లెఫ్టినెంట్ క‌ల్న‌ల్స్‌పై హ‌త్యాయ‌త్నం కేసు

59చూసినవారు
ముగ్గురు లెఫ్టినెంట్ క‌ల్న‌ల్స్‌పై హ‌త్యాయ‌త్నం కేసు
ఆర్మీకి చెందిన ముగ్గురు లెఫ్టినెంట్ క‌ల్న‌ల్స్‌తో పాటు 13 మంది సైనికుల‌పై హ‌త్యాయ‌త్నం, దొంగ‌త‌నం కేసు న‌మోదు అయ్యింది. కుప్వారా పోలీసు స్టేష‌న్‌పై జ‌రిగిన దాడిలో భాగంగా ఈ కేసును ఫైల్ చేశారు. మే 28న ఓ డ్ర‌గ్ కేసులో జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులు ఓ ఆర్మీ జ‌వాన్‌ను విచారించారు. జ‌వాన్‌ను ప్ర‌శ్నించ‌డాన్ని త‌ప్పుప‌ట్టిన క‌ల్న‌ల్స్ దాడికి దిగారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు, స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ గాయ‌ప‌డ్డారు. దీని కారణంగా జ‌వాన్ల‌పై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్