ఆర్మీకి చెందిన ముగ్గురు లెఫ్టినెంట్ కల్నల్స్తో పాటు 13 మంది సైనికులపై హత్యాయత్నం, దొంగతనం కేసు నమోదు అయ్యింది. కుప్వారా పోలీసు స్టేషన్పై జరిగిన దాడిలో భాగంగా ఈ కేసును ఫైల్ చేశారు. మే 28న ఓ డ్రగ్ కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు ఓ ఆర్మీ జవాన్ను విచారించారు. జవాన్ను ప్రశ్నించడాన్ని తప్పుపట్టిన కల్నల్స్ దాడికి దిగారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గాయపడ్డారు. దీని కారణంగా జవాన్లపై కేసు నమోదు చేశారు.