వేలంలో వినాయకుని లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు (వీడియో)

75చూసినవారు
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసక్తికర ఘటన జరిగింది. అశ్వాపురం మండలం చవిటిగూడెంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఉంచిన లడ్డూను వేలంగా ముస్లిం యువకుడు షేక్ అస్రఫ్ దక్కించుకున్నాడు. రూ.53,000లకు లడ్డూను వేలంపాటలో ఆయన దక్కించుకోవడంతో స్థానికులు అభినందించారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని పలువురు పేర్కొంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్