నా ఫోన్ కూడా ట్యాప్ అయింది: తమిళిసై

57చూసినవారు
నా ఫోన్ కూడా ట్యాప్ అయింది: తమిళిసై
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైందని ఆరోపించారు. 'ఫోన్ ట్యాపింగ్ అంశంపై 2022 నవంబర్లోనే నేను స్పందించా. రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నానంటూ గత ప్రభుత్వం నా ప్రకటనలను తోసిపుచ్చింది. గతంలో నేను చెప్పిందే ఇప్పుడు నిజమవుతోంది' అని తమిళిసై ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్