యూపీలోని గోండా జిల్లాలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ఉమ్రీ బేగంగంజ్లోని అడంపూర్ పెట్రోల్ బంక్ వద్దకు కొందరు దుండగులు వచ్చారు. బైక్లలో పెట్రోల్ నింపుకున్నాక, సేల్స్మెన్తో వారు గొడవ పెట్టుకున్నారు. సేల్స్మెన్ను తీవ్రంగా కొట్టి, పెట్రోల్ బంక్లో రూ.79,800 దోపిడీ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా సీసీటీవీలో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.