గ్రామప్రజలందరూ విధిగా హాజరవ్వండి
తిరుమలగిరి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడానికి వంగూర్ మండల అధికారులతో పాటు స్థానిక శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ మరియు సర్పంచ్ కడారి మల్లయ్య యాదవ్ శుక్రవారం పాల్గొనబోతున్నారు. కావున ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ ప్రజలందరూ విధిగా పాల్గొనాలని వంగూర్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడారి వెంకటయ్య యాదవ్ పిలుపునిచ్చారు.