మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట: చామల

77చూసినవారు
మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట: చామల
మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలోని దీప్తి హోటల్‌లో జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ఆయన మాట్లాడారు. 'మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100రోజులలోపే ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులను నిర్లక్ష్యం చేసింది. మత్స్యకారులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు' అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, TPCC ప్రధాన కార్యదర్శి బాల లక్ష్మి, యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ ధర్మరాజు, వైస్ చైర్మన్ జానకి రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల రాజు, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల చైర్మన్లు, అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్