రాష్ట్ర ప్రింట్ మీడియా కార్యదర్శిగా నియామకం

1777చూసినవారు
రాష్ట్ర ప్రింట్ మీడియా కార్యదర్శిగా నియామకం
జాతీయ చేనేత ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం ఖిల్లా బజారుకు చెందిన సీనియర్ జర్నలిస్టు వనం శ్రీనివాసును రాష్ట్ర కమిటీ ప్రింట్ మీడియా కార్యదర్శిగా నియామకం చేస్తూ శనివారం ఉత్తర్వులు అందించి తక్షణమే అమలులోకి వస్తాయని జాతీయ చేనేత ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రాపోలు వీర మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ చేనేత ఐక్యవేదిక ద్వారా కార్మికుల పరిష్కారం కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వనం శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రింట్ మీడియా కార్యదర్శిగా నియామకం చేసిన రాష్ట్ర స్థాయి నాయకులకు జిల్లా స్థాయి నాయకులకు దేవరకొండ డివిజన్ పద్మశాలి కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మీడియా ద్వారా చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశ వరకు తాను పోరాడుతానని అన్నారు. పత్రికా రంగంతో పాటు అనేక హోదాలలో అనేక రంగాలలో పద్మశాలి యువత మహిళలు పనిచేస్తున్నారని ఆయా రంగంలో పనిచేసేటువంటి వారికి పద్మశాలి సోదరులు సోదరీమణులు సహకరించి ఐక్యతతో ముందుకు వెళ్లడానికి కృషి చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్