రంజాన్ కిట్ల పంపిణీ

2390చూసినవారు
రంజాన్ కిట్ల పంపిణీ
దేవరకొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మజీద్ ఈ మసీదులో 300 మంది పేద ముస్లింలకు విడి ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవరకొండ మున్సిపల్ మాజీ చైర్మన్ దేవేందర్ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయనను మసీదు కమిటీ శాలువాతో ఘనంగా సన్మానించింది. పేదలు పండగను ఆనందాల మధ్యన జరుపుకోవాలని ఉద్దేశంతో ముస్లిం సోదరీమణులకు సోదరులకు చక్కెర చింతపండు నూనె మసాలా దినుసులు తదితర వస్తువులను 300 మందికి అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ కిట్లను అందించడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబాలలో రంజాన్ ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షులు అజీముద్దీన్ సదర్ మునీర్ పాషా, ఎస్కే నిరంజన్ , ఖాదర్ బాబా, అఫ్జల్ కొలుకులపల్లి గెలువయ్య, ఖాదర్ బాబా, హతిక్, అబ్దుల్లా, కరీం, రమేష్, రాకేష్, పర్వతాలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్