ఎమ్మెల్యే పై దూషణలు మానుకోవాలి

746చూసినవారు
ఎమ్మెల్యే పై దూషణలు మానుకోవాలి
దేవరకొండ నియోజకవర్గంలో 130 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ అభివృద్ధిని తాటి కోల్ సర్పంచ్ జూలూరు ధనలక్ష్మి అడ్డుకుంటున్నారని దేవరకొండ ఎంపీపీ నల్లగాస్ జాన్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హనుమంతు వెంకటేష్ గౌడ్, రైతుబంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, సర్పంచులతో కలిసి అన్నారు. బుధవారం ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేవరకొండ ఎమ్మెల్యేకు ఇసుకకు ఏం సంబంధం అని స్థాయిని మరిచి మాట్లాడుతున్న సర్పంచ్ ఎమ్మెల్యే పై ఆరోపణలు అర్థరహితమని తెలిపారు. అసత్యపు ఆరోపణలు చేస్తున్న సర్పంచ్ ధనలక్ష్మి అమ్మ పద్ధతి మార్చుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే ను దూషించేస్తాయి అమ్మకు లేదని ప్రభుత్వం ద్వారా ఇసుక తరలింపుకు అనుమతులు ఉన్నాయని అనవసరంగా పేపర్ మీడియా పబ్లిసిటీ కోసమే తమపై దూషణలు చేస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఆమె పద్ధతి తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండ భీమనపల్లి సర్పంచ్ మునికుంట్ల విద్యావతి వెంకటరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నేనావత్ శ్రీను నాయక్, కాసారం సర్పంచ్ నోముల లక్ష్మీ శ్రీనివాస్, ముదిగొండ సర్పంచ్ రేపాని ఇద్దయ్య, అంబటోగూడెం సర్పంచ్ అంజయ్య, పాత్తం వత్ సర్పంచ్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్