అడవిదేవులపల్లి గ్రామంలోని భాస్కర్ రావు చెరువు ఆక్రమణలు అడ్డుకోవాలని మత్స్యపారిశ్రామిక సహకారసంఘసభ్యులు సోమవారం మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సొసైటీ అధ్యక్షులు చెన్నబోయిన సైదయ్య మాట్లాడుతూ సర్వేనెం. 59లో136. 25ఎకరాలవిస్తీర్ణంలో చెర్వువిస్తరించిఉందని, కాగా చెర్వు భూమిని కొందరు కబ్జాకి యత్నిస్తున్నారన్నారు. అధికారులు స్పందించి చెర్వుసర్వేచేసి హద్దులు గుర్తించాలన్నారు.