దాడికేసులో నిందితుల అరెస్ట్

79చూసినవారు
దాడికేసులో నిందితుల అరెస్ట్
మద్యంమత్తులో హోటల్ నిర్వాహకుల పై దాడి చేసి గాయపర్చిన కేసులో నిందితులను శనివారం మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం. ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున నల్గొండ రోడ్డులోని బైపాస్ రోడ్డు వెంట ఉన్న ఉషారాణి హోటల్ కి నాగెళ్ళ సురేష్, ఇరుగు ఏడుకొండలు, దామర రాంబాబు, మరో వ్యక్తి కలిసి హోటల్ దగ్గరకి వెళ్లి పరోటాలు కావాలని గొడవ పడి హోటల్ యజమాని వెంకటేశ్వర రావు పై కత్తితో దాడి చేసి గాయపర్చారు. గాయలపాలైన వెంకటేశ్వర రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి కోర్ట్ కి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్