నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మండల కేంద్రానికి చెందిన విద్యార్థులకు తెలంగాణ ఆదర్శ పాఠశాల లో ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులు ఎంపికచేయడం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపడం వల్ల 80 సీట్లకుగాను 450 మంది అప్లై చేసుకోవడం ఆసక్తికరమైన విషయం. శనివారం ప్రవేశ పరీక్ష జరగనుంది.