మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ని గుర్తించి సీజ్ చేసినట్టు ఎస్సై నరేష్ కుమార్ గురువారం తెలిపారు. పెట్రోలింగ్లో భాగంగా దామరచర్ల మండలం నూనవత్ తండాకి చెందిన బాదావత్ రామ్ కొండ ట్రాక్టర్ లో ఇసుక తరలిస్తు పట్టుబడ్డాడని, ఇసుక తరలింపుకు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో అతనిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్ సీజ్ చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు.