నమో డ్రోన్ దీదీ పథకం.. మహిళలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల ప్రయోజనం

85చూసినవారు
నమో డ్రోన్ దీదీ పథకం.. మహిళలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల ప్రయోజనం
మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 14500 స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లను అందజేయనున్నారు. ఈ డ్రోన్లను నానో ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేయడానికి ఉపయోగిస్తారు. రూ. 10 లక్షల విలువైన ఈ డ్రోన్లను సహాయక బృందాలకి రూ.8 లక్షలు (80 శాతం) సబ్సిడీతో ఇవ్వనున్నారు. అలాగే రూ.2 లక్షల (20 శాతం) రుణం లభిస్తుంది.

సంబంధిత పోస్ట్