బీజేపీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

85చూసినవారు
బీజేపీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎన్నికల కోసమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయన్న ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఇండియా కూటమి మరింత బలపడుతుందని చెప్పారు. ఇటీవల మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తప్పిదాలతోనే బీజేపీ గెలిచిందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ దాడి ఘటనపై సమాధానం చెప్పలేకే ఎంపీలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్