జమ్మూకశ్మీర్ లో జాతీయ గీతాలాపన తప్పనిసరి: విద్యాశాఖ

63చూసినవారు
జమ్మూకశ్మీర్ లో జాతీయ గీతాలాపన తప్పనిసరి: విద్యాశాఖ
జమ్మూకశ్మీర్ లోని అన్ని పాఠశాలల్లోనూ రోజూ ఉదయం అసెంబ్లీ సమయంలో ఖచ్చితంగా జాతీయగీతాన్ని ఆలపించాలని అక్కడి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సర్క్యులర్ జారీ చేశారు. ఉదయం అసెంబ్లీల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక సమగ్రత, ఐకమత్యం అలవడతాయని అందులో వివరించారు. అవసరమైతే ప్రత్యేక అతిథుల్ని ఆహ్వానించి విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంచాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్