ఢిల్లీలో నీట్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు NEET UG-2024 ఫలితాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. వారందరికీ జూన్ 23న మరోసారి ఎగ్జామ్ నిర్వహించి, జూన్ 30లోపు ఫలితాలను వెల్లడిస్తామని వెల్లడించింది. NEET యూజీ-2024 కౌన్సెలింగ్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కౌన్సిలింగ్పై స్టే విధించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.